Friday, 11 September 2026 10:30:35 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Date : 10 February 2026 07:35 PM Views : 223

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పెద్దపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, మంథనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రామగుండం లోని సరస్వతి శిశు మందిర్ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అర్బన్ లోకల్ బాడీస్ కు రెండవ సాధారణ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరుగుతున్నాయని, మన జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సంబంధిత మున్సిపాలిటీలలో ఏర్పాటు చేశామని, ప్రతి చోట పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని పోలింగ్ సామాగ్రిని ప్రశాంతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రామగుండంలో ఏకగ్రీవమైన ఒక డివిజన్ మినహాయించి జిల్లాలోని మిగిలిన 123 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయని, సుమారు 470 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం నందు వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు.

క్రిటికల్ పోలింగ్ కేంద్రాల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది అవసరమైన సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్, మనోహర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: