ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణానికి చెందిన పాలకుర్తి సత్యనారాయణ పట్టణంలో జనరల్ స్టోర్ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. కాగా సత్యనారాయణ అతని భార్య రమ అయ్యప్ప దీక్షతీసుకున్నారు. విరమణ కోసం శబరిమల వెళ్లారు. పాలకుర్తి సత్యనారాయణ ( 63), రమదేవి (59) దంపతులు అయ్యప్ప మాలలో ఓ ప్రైవేట్ సర్వీస్ లో శబరిమలై దర్శనానికి వెళ్లారు.15 న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్ లో నిన్న సాయంత్రం 6-55 నిమిషాలకు అయ్యప్ప స్వాముల కోసంరెండు గంటల సేపు టూరిస్ట్ నిలిపివేశారు. సముద్ర స్నానం, అక్కడున్న దేవాలయాలు సందర్శించి టూరిస్ట్ ఆపిన చోటికి రాత్రి 9 గంటలకు దంపతులు రోడ్డు దాటుతుండగ ఓ వాహనం ఢీ కొని దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన దంపతులమృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో లక్షెట్టిపేట పట్టణంలో విషాద ఛాయలుముకున్నాయి. 15 సంవత్సరాల క్రితం భార్యాభర్తల మృతి గుర్తుకొచ్చిన వేళ.. లక్షెట్టిపేట పట్టణానికి చెందిన నస్పూరి సూర్యనారాయణ అతని భార్య పద్మ హైదరాబాదులో పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా సిద్దిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మళ్లీ 15 సంవత్సరాల క్రితం అలాంటి సంఘటన జరగడంతో ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Admin
E Nivas News