Saturday, 13 June 2026 01:20:54 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం...

Date : 13 January 2026 10:32 PM Views : 147

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివ ర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర ఈ నెల 28న ప్రారంభం కానుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్​ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​ రెడ్డి, శంకుస్థా పనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొంటారు. అనంతరం సీపీఐ వంద సంవత్సరాల వేడుకలకు సీఎం హాజరవుతారు. అదే రోజున సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి.కీలక అంశాలపై చర్చలు :19న ఉదయం అమ్మవార్ల నూత న ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి హైదరాబాద్​కు తిరుగు పయనమవుతారు. మేడారంలో నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ప్రధానంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా కేబినెట్​ భేటీలో నిర్ణయంతీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టనుండటంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్​ రూపుకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్​ రోడ్లు, తదితర అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :