ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో ఆదివారం మర్యాద పూర్వకంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు కలిశారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి తెలిపారు. జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు పూర్తి, పీపీరావు ప్రాజెక్టు పునరుద్ధరణ, ఖర్జి పెద్ద చెరువు పునరుద్ధరణ మరియు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల నిర్వహణ పనుల కోసం నిధులు కేటాయించాలని మంత్రి ని కోరారు. అలాగే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు డిపిఆర్ పై చర్చించారు. సానుకూలంగా స్పందించిన సాగునీటి శాఖ మంత్రి త్వరలో పెండింగ్ ప్రాజెక్టుల అంశం పై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ ప్రభాకర్, డీఈలు భద్రయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.
Admin
E Nivas News