ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రంగారెడ్డి జిల్లాలోని మోకిల వద్ద గురువారంజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల పట్టణానికి చెందిన దేవుళ్ల సూర్యతేజతో సహా నలుగురు విద్యార్థులు మృతి చెందారు. హైదరాబాదులో డిగ్రీ చదువుతున్న సూర్యతేజ, తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల అనంతరం కారులో తిరిగి వస్తుండగా, ముందున్న బారికేడ్లను తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
Admin
E Nivas News