ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా ఉపకార వేతన పథకం క్రింద 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్ష దరఖాస్తు గడువు పొడిగించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్య బుధవారంఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ ఎయిడెడ్, వసతి సౌకర్యం లేని మోడల్ పాఠశాలలలో 2026–27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 5వ తేదీ లోగా ఆన్లైన్ లో http/bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 8వ తేదీలోగా జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఆన్లైన్ అప్లికేషన్ల హార్డ్ కాపీలను అందజేయాలని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. జనరల్ బి.సి. విద్యార్థులు 100 రూపాయలు, ఎస్.సి., ఎస్.టి., దివ్యాంగ విద్యార్థులు 50 రూపాయలు ఆన్లైన్ లో రుసుము చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. నవంబర్ 2025లో ఈ పథకం క్రింద ఎంపిక కాబడి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు నూతనంగా, గతంలో ఎంపిక కాబడి ప్రస్తుతం 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు రెన్యువల్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు పొడిగించడం జరిగిందని తెలిపారు. ఆన్ లైన్ లో చేసిన దరఖాస్తులను పాఠశాల స్థాయి నోడల్ అధికారి అక్టోబర్ 15వ తేదీలోగా ఆన్ లైన్ లో పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో హార్డ్ కాపీ అందించాలని తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Admin
E Nivas News