Tuesday, 28 July 2026 04:39:50 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు..

50 మందికి ఉపాధి కల్పించాలని బర్త్‌డే ఛాలెంజ్ విసిరిన పెద్దపల్లి ఎంపీ...

Date : 24 July 2026 11:11 PM Views : 60

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంకుల్‌కు శుక్రవారం 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక బర్త్‌డే ఛాలెంజ్ విసిరారు. 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం 50 మంది యువతకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఎంపీ "కేటీఆర్ అంకుల్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు పదేళ్లపాటు మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఈ 50వ జన్మదినం సందర్భంగా కనీసం 50 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మీకు బర్త్‌డే ఛాలెంజ్ విసురుతున్నాను అన్నారు. అదే మీ జన్మదినానికి సమాజానికి అందించే ఉత్తమ బహుమతి అవుతుందన్నారు.అలాగే గతంలో గ్లోబరీనా సంస్థ, పేపర్ లీకేజీల అంశాల నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగానష్టపోయారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి అండగా నిలవాలని కేటీఆర్ అంకుల్‌ను కోరారు. జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని, యువతకు ఉపాధి కల్పించడం, బాధిత విద్యార్థులకు సహాయం చేయడం వంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.చివరగా కేటీఆర్ అంకుల్‌కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ,జై హింద్, జై తెలంగాణ" అంటూ తన సందేశాన్ని ముగించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: