ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంకుల్కు శుక్రవారం 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక బర్త్డే ఛాలెంజ్ విసిరారు. 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం 50 మంది యువతకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా ఎంపీ "కేటీఆర్ అంకుల్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు పదేళ్లపాటు మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఈ 50వ జన్మదినం సందర్భంగా కనీసం 50 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మీకు బర్త్డే ఛాలెంజ్ విసురుతున్నాను అన్నారు. అదే మీ జన్మదినానికి సమాజానికి అందించే ఉత్తమ బహుమతి అవుతుందన్నారు.అలాగే గతంలో గ్లోబరీనా సంస్థ, పేపర్ లీకేజీల అంశాల నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగానష్టపోయారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి అండగా నిలవాలని కేటీఆర్ అంకుల్ను కోరారు. జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని, యువతకు ఉపాధి కల్పించడం, బాధిత విద్యార్థులకు సహాయం చేయడం వంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.చివరగా కేటీఆర్ అంకుల్కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ,జై హింద్, జై తెలంగాణ" అంటూ తన సందేశాన్ని ముగించారు.
Admin
E Nivas News