Wednesday, 29 July 2026 06:28:21 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతం...

Date : 18 October 2025 07:27 PM Views : 305

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 42 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం బంద్ విజయవంతమైనది. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలు సినిమా హాలు పెట్రోల్ బంకులు పాఠశాలలు తదితర సంస్థలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు ఆయా జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ 42 శాతం బీసీ లకు రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు.బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ రకాల కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బీసీలకు న్యాయమైన డిమాండ్ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉందని దీనికి కాంగ్రెస్ పార్టీ,బిజెపి పార్టీ, టీఆర్ఎస్ నాయకులు, కుల సంఘాల నాయకులు మద్దతు తెలుపుతుందని వారు తెలిపారు.ఏమైనప్పటికీ కాంగ్రెస్,బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు బీసీల పక్షపాతి అని బీసీల న్యాయమైన రిజర్వేషన్లు అందే వరకు బీసీల పక్షాన నిలబడి పోరాడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేంతవరకు కలిసికట్టు పోరాడుతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ఆయా కుల సంఘాల సైతం మద్దతు తెలిపాయి. ఈ అఖిలపక్ష నాయకులు శాంతియుతంగా ధర్నాలు రాస్తారోకోలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పలు జిల్లా మండల కేంద్రాల్లో అఖిలపక్ష నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మండలాల అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :