ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : 42 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం బంద్ విజయవంతమైనది. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలు సినిమా హాలు పెట్రోల్ బంకులు పాఠశాలలు తదితర సంస్థలు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు ఆయా జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ 42 శాతం బీసీ లకు రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు.బీజేపీ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ రకాల కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బీసీలకు న్యాయమైన డిమాండ్ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉందని దీనికి కాంగ్రెస్ పార్టీ,బిజెపి పార్టీ, టీఆర్ఎస్ నాయకులు, కుల సంఘాల నాయకులు మద్దతు తెలుపుతుందని వారు తెలిపారు.ఏమైనప్పటికీ కాంగ్రెస్,బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు బీసీల పక్షపాతి అని బీసీల న్యాయమైన రిజర్వేషన్లు అందే వరకు బీసీల పక్షాన నిలబడి పోరాడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేంతవరకు కలిసికట్టు పోరాడుతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ఆయా కుల సంఘాల సైతం మద్దతు తెలిపాయి. ఈ అఖిలపక్ష నాయకులు శాంతియుతంగా ధర్నాలు రాస్తారోకోలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పలు జిల్లా మండల కేంద్రాల్లో అఖిలపక్ష నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మండలాల అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News