ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా క్రీడాకారులు మెడల్స్ సా ధించడం పట్ల జిల్లా అసో సియేషన్ అధ్యక్షులు పంత కాని సమ్మయ్య కార్యదర్శి పూతల సమయ్యలు హర్షం వ్యక్తంచేశారు.హనుమకొండ జవహర్ స్టేడియంలో జరు గుతున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్ పోటీలలో అండర్16 షార్ట్ పూట్ గోల్డ్ మెడల్స్ సాధించిన సమ న్విత,అండర్18.లాంగ్ జం ప్ సిల్వర్ మెడలిస్ట్ అన్విత లతో పాటు పలు విభాగాల్లో మెడల్స్ సాధించిన క్రీడా కాలకు ఆదివారం మెమొం టోలు,సర్టిఫికెట్ ప్రధానం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు క్రీడల అభి వృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ,గ్రామీణ మారు మూల క్రీడాకారుల దాగి ఉ న్న ప్రతిభ వెలికి తీయడాని కి కృషి చేస్తున్నారని అన్నా రు.రాష్ట్ర అథ్లెటిక అసోసి యేషన్ సెక్రటరీ సారంగపా ణి రాష్ట్ర నలుమూలల నుం చి తరలివచ్చిన1600.మం ది అథ్లెట్లు క్రీడాకారు లకు పలు ఈవెంట్లో పోటీలను నిర్వహించి విజేతలను అభినందించారు.జయ శంకర్ జిల్లాలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలు నిర్వ హణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్టేట్ సెక్రటరీ సారంగపాణి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సె క్రెటరీ వెంకటే శ్వర్ రెడ్డి,డి. వైస్.ఓ.అశోక్.క్రీడా అబి మానులు నవీన్ రావు,రా మ్నారాయణ,మధుకర్.లక్ష్మణ్ తదితరులు విజే తలైన క్రీడాకారులను అభినందిం చారు.
Admin
E Nivas News