ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలంలోని అంకతిపల్లిలో మంగళవారం ఇందిరమ్మ చీరలను మహిళలకు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు గ్రామంలోని మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని కొనియాడారు. ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలని ఆలోచనతో రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచిత సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమం లో లక్షెట్టిపేట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గణవేణి పోచకుమార్, అంకతిపల్లి గ్రామ అధ్యక్షులు అరిగేల చందు, లింగంపల్లి వెంకటేష్, మోదల శ్రీను, అరిగేల భూమయ్య, చిన్నయ్య, మహేష్, మహిళా సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News