ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు ఆగస్టు 15లోగా తొమ్మిది రకాల వస్తువులతో కూడిన ఎడ్యుకేషన్ కిట్లను అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.వనపర్తి జిల్లా కొత్తకోటలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకొత్త భవనాన్నిప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో విద్యా ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు 50 మంది టీచర్లను విదేశాలకు పంపామని, ఈసారి మరో 150 మందిని సింగపూర్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ దేశాలకుపంపుతున్నట్టు చెప్పారు.
Admin
E Nivas News