Saturday, 13 June 2026 01:18:05 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

విద్యతోపాటు క్రీడలు చాలా అవసరం...

ట్రినిటీ పాఠశాలలో వార్షిక క్రీడోత్సవాల్లో ఎంపీ

Date : 06 January 2026 05:21 PM Views : 181

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రినిటీ పాఠశాలలో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలలో పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో పాటు జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఎంపీ పాఠశాలకి రావడంతో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయన్నారు. నేను చదువుకునే రోజుల్లో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడేవాడిని. క్రీడలు జీవితం లో ఒక భాగం. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి” అని తెలిపారు. అలాగే గెలుపు–ఓటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించే మనస్తత్వం క్రీడల ద్వారా వస్తుందని, టీమ్ స్పిరిట్ అలవడుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని, క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడడంతో నిజ జీవితంలో వచ్చే ఆటుపోట్లు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని ఎంపీ అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రీడలను జీవన భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి) అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ హరికృష్ణ , డీసీసీ మాజీ సెక్రటరీ నల్ల రవి తదితర నాయకులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. క్రీడోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలను ఎంపీ తిలకించి, విజేతలైన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :