ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో గిరిజన విద్యార్థుల విద్యా అభివృద్ధి కొరకు నూతనంగా రూ. 230 లక్షలతో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎంపి గోడం నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద గిరిజన విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు కల్పిస్తున్న గొప్ప అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తాను చదివే రోజుల్లో పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోయేవని కానీ నేటి ప్రభుత్వాలు పేద గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, మరియు పాఠశాల ఉపాధ్యాయులు,నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.
Admin
E Nivas News