Monday, 02 March 2026 04:58:03 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

భక్తజన సందోహంతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు...! శివయ్యను దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు

శివ నామస్మరణతో మారు మ్రోగిన దేవాలయాలు..

Date : 15 February 2026 10:16 PM Views : 67

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తోపాటు, కాలేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి స్వామి, కొమురవెల్లి మల్లన్న ఆలయాలతో పాటు తెలంగాణలో గల శైవ క్షేత్రాలన్ని ఆదివారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా తెలంగాణ నుండి కాకుండా మహారాష్ట్ర, యూపీ, ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారు మ్రోగిపోయాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి ఆలయాలలో సిబ్బంది భక్తులకు దర్శించుకునేలా వీలు కల్పించారు.

శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు ఒకరోజు ముందే ప్రముఖ ఆలయాలకు చేరుకోగా దేవదాయ శాఖ ఆలయాల సమీపంలో గల ధర్మసత్రాలన్నీ నిండిపోవడంతో చాలా మ వేలాది మంది భక్తులు ఉండడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైవేటు గదులు కలవారు భక్తుల వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ గదులు ఇవ్వడంతో చేసేదిలేక వచ్చిన భక్తులు తిరిగి వెళ్లలేక డబ్బులు చెల్లించి బస చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సామాన్య ప్రజలే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వారికోసం ప్రత్యేక దారి ఏర్పాటు చేసి దర్శనాలు చేయించారు. భక్తులు రాత్రిపూట ఆలయాల వద్దని జాగరణ దీపాలు వెలిగించి జాగరణ చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :