ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తోపాటు, కాలేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి స్వామి, కొమురవెల్లి మల్లన్న ఆలయాలతో పాటు తెలంగాణలో గల శైవ క్షేత్రాలన్ని ఆదివారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా తెలంగాణ నుండి కాకుండా మహారాష్ట్ర, యూపీ, ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి సైతం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయాలన్నీ శివనామస్మరణతో మారు మ్రోగిపోయాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి ఆలయాలలో సిబ్బంది భక్తులకు దర్శించుకునేలా వీలు కల్పించారు.
శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు ఒకరోజు ముందే ప్రముఖ ఆలయాలకు చేరుకోగా దేవదాయ శాఖ ఆలయాల సమీపంలో గల ధర్మసత్రాలన్నీ నిండిపోవడంతో చాలా మ వేలాది మంది భక్తులు ఉండడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైవేటు గదులు కలవారు భక్తుల వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తూ గదులు ఇవ్వడంతో చేసేదిలేక వచ్చిన భక్తులు తిరిగి వెళ్లలేక డబ్బులు చెల్లించి బస చేయాల్సిన పరిస్థితి దాపురించింది.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సామాన్య ప్రజలే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వారికోసం ప్రత్యేక దారి ఏర్పాటు చేసి దర్శనాలు చేయించారు. భక్తులు రాత్రిపూట ఆలయాల వద్దని జాగరణ దీపాలు వెలిగించి జాగరణ చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Admin
E Nivas News