ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బాసర ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా జాదవ్ దత్తు పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025-26 నూతన కార్యవర్గాన్ని శుక్రవారం బాసర ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సభ్యులు సీనీయర్ పాత్రికేయుల సమక్షంలో ఓ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్నికలు నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా కొండూరి ప్రతాప్ రావు, దేవునే శంకర్ రావు, అధ్యక్షులుగా జాదవ్ దత్తు పటేల్, ఉపాధ్యక్షులుగా జాదవ్ గణేష్ పటేల్, పింపలే రామేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా రత్నెల్లి రమేష్, సంయుక్త కార్యదర్శులుగా గడ్డం రాజేందర్, గురప్ప శంకర్, కోశాధికారిగా మల్లెల మోజెష్, పిఆర్వోగా కారేగం సాయందర్, సలహాదారులుగా కోర్వ సదానంద్, మమ్మాయి మహేందర్, బిస్నె సంతోష్, పల్లె హరిదాస్, అల్జాపూర్ సుధాకర్, అల్లం అనిల్, కమిటీ సభ్యులుగా బత్తిరి ప్రసాద్, దొడ్ల నగేష్, ఇందూర్ అనిల్, సోలంకే రవి పటేల్, జంగం మహేష్, వేంపల్లి సంతోష్ గౌడ్, దావు రాజు, బచ్చువర్ రవి, విజయ్ ఎమ్మెవార్, అవధూత్, విశాల్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Admin
E Nivas News