Tuesday, 28 July 2026 06:17:47 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం...

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)పి.చంద్రయ్య

Date : 03 March 2026 03:09 AM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళలలో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదన కలెక్టర్ (రెవెన్యూ)శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, ఇతర అధికారులతో కలిసి గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ అంతం చేసేందుకు ప్రభుత్వం నడుము బిగించిందని, ఇందులో భాగంగా జిల్లాలో 14 సంవత్సరాలు నిండిన 15 సంవత్సరంలో లోపు ఉన్న బాలికలకు సుమారు 8 వేల 184 మంది బాలికలకు హెచ్.పి.వి.వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. ఒక డోసు ఎడమ చేతికి ఇచ్చిన తర్వాత చూపుడు వేలికి గుర్తింపు కోసం ఇంకు పెడతారని, వివరాలను యూవిన్ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం 3 నెలల పాటు కొనసాగుతుందని, తర్వాత ఈ కార్యక్రమమును జాతీయ టీకాల కార్యక్రమంలో కలపడం జరుగుతుందని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకునే పిల్లలు, ఆయా పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పేరెంట్స్ టీచర్ సమావేశం నిర్వహించి,ఈ వ్యాక్సిన్ ఉపయోగం వివరములు తెలియజేసిన తర్వాత వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, వ్యాక్సిన్ తీసుకునే పిల్లలు ఖచ్చితంగా టిఫిన్ లేదా భోజనం చేసిరావాలనితెలిపారు. టీకా తీసుకున్నాక అరగంట పాటు వ్యాక్సిన్ కేంద్రంలోనే ఉండాలని, వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తిగా స్వచ్ఛందమని, అనారోగ్యంతో ఉన్నా, అలర్జీలు ఉన్నా వ్యాక్సిన్ వేయరని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పిపి యూనిట్లలో ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో,అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, వైద్యాధికారుల ఆధ్వర్యంలో టీకా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల అనుసంధానంతో, స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమమును చేపట్టడంజరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్.ఏ ప్రసాద్,జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,డిపిఓ ప్రశాంతి, సిహెచ్ఓ లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, పద్మ,డి పి హెచ్ ఎన్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: