ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రాఖీ పౌర్ణమి వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని అక్కలు చెల్లెల్లు వారి యొక్క అన్నలు,తమ్ముళ్ల వద్దకు వెళ్లి రాఖీలు కట్టి వారి యొక్క ప్రేమను చాటి చెప్పారు. అలాగే అన్న తమ్ముళ్లు సైతం వారికి మీకు రక్షగా ఉంటామని ప్రమాణం చేసి వారికి కానుకలను అందజేసారు. రాఖీ పౌర్ణమి నేపద్యంలో గత రెండు రోజుల నుండి అక్క చెల్లెలు వారి యొక్క అన్న తమ్ముళ్ల ఇళ్లలోకి రావడంతో పల్లెలతో పాటు పట్టణాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఎటు వైపు చూసిన ప్రతి ఇంటిలో పండగ వాతావరణం నెలకొంది. అక్క చెల్లెలు ఇంటికి రావడంతో అన్నదమ్ములు ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. అంతేకాకుండా రెండు రోజులు ప్రతి ఇంటిలో పిండివంటలతో సహపంక్తి భోజనాలు చేశారు. అంతేకాకుండా సొంత అక్క చెల్లెలు లేని వారు సైతం వారిని ప్రేమగా అన్నా తమ్ముళ్ల వలె భావించిన వారి వద్దకు వెళ్లి రాఖీలు కట్టించుకొని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు,నాయకులు, అధికారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాఖీ పౌర్ణమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు.
Admin
E Nivas News