ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ఆర్టీసీలో పని చేస్తున్న దళిత మహిళ కార్మికుల పట్ల ఆర్టీసి డీఎం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంథని బస్టాండ్ గేటు ముందు స్వీపింగ్ కార్మికులు చిప్ప చేత పట్టుకొని ధర్నా నిర్వహించి ప్రయాణికుల నుండి భిక్షాటన చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న దళిత మహిళ కార్మికుల పట్ల వివక్షత చూపుతూ డీఎం నియంతల వ్యవరిస్తున్నాడని అన్నారు. కార్మికులను ఇష్టాను రీతిలో తొలగిస్తూ ఇష్టాను రీతిలో తీసుకుంటున్నాడని విమర్శించారు. అంత్య పుష్కరాల సందర్భంగా ఒక కార్మికురాలును విధుల్లోకి తీసుకొని పారిశుద్ధ్య పనులు చేయించుకొని పుష్కరాలు పూర్తికాగానే విధుల నుండి తొలగించారన్నారు. కార్మికులను ఎందుకు తొలగించారని అడిగితే డిఎం, కాంట్రాక్టర్ ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకొని కార్మికుల మధ్యన చిచ్చురేపి కార్మికుల గొడవలకు కారణమవుతున్నారని విమర్శించారు. దళిత మహిళా కార్మికులు తమ గోడు వెళ్ళబుచుకుందామని డిఎం వద్దకు వెళితే కనీసం కలవనీయకుండా తమ సిబ్బందితో దళిత మహిళా కార్మికులను గేటు బయటకు గెంటేశాడని ఆరోపించారు. బస్టాండ్ అభివృద్ధి పేరిట లక్షలాది రూపాయలను ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అదే బస్టాండ్ లో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని, ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోలో జరుగుతున్న పరిణామాలపై సమగ్రమైన విచారణ జరిపి ఆర్టీసీ డిఎం పై చర్యలు తీసుకొని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్పుల సురేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్యలు పాల్గొన్నారు
Admin
E Nivas News