Thursday, 30 July 2026 12:25:10 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

స్వీపింగ్ కార్మికుల నిరసన

మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులు

Date : 05 June 2026 05:20 PM Views : 118

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ఆర్టీసీలో పని చేస్తున్న దళిత మహిళ కార్మికుల పట్ల ఆర్టీసి డీఎం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంథని బస్టాండ్ గేటు ముందు స్వీపింగ్ కార్మికులు చిప్ప చేత పట్టుకొని ధర్నా నిర్వహించి ప్రయాణికుల నుండి భిక్షాటన చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న దళిత మహిళ కార్మికుల పట్ల వివక్షత చూపుతూ డీఎం నియంతల వ్యవరిస్తున్నాడని అన్నారు. కార్మికులను ఇష్టాను రీతిలో తొలగిస్తూ ఇష్టాను రీతిలో తీసుకుంటున్నాడని విమర్శించారు. అంత్య పుష్కరాల సందర్భంగా ఒక కార్మికురాలును విధుల్లోకి తీసుకొని పారిశుద్ధ్య పనులు చేయించుకొని పుష్కరాలు పూర్తికాగానే విధుల నుండి తొలగించారన్నారు. కార్మికులను ఎందుకు తొలగించారని అడిగితే డిఎం, కాంట్రాక్టర్ ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకొని కార్మికుల మధ్యన చిచ్చురేపి కార్మికుల గొడవలకు కారణమవుతున్నారని విమర్శించారు. దళిత మహిళా కార్మికులు తమ గోడు వెళ్ళబుచుకుందామని డిఎం వద్దకు వెళితే కనీసం కలవనీయకుండా తమ సిబ్బందితో దళిత మహిళా కార్మికులను గేటు బయటకు గెంటేశాడని ఆరోపించారు. బస్టాండ్ అభివృద్ధి పేరిట లక్షలాది రూపాయలను ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అదే బస్టాండ్ లో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని, ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోలో జరుగుతున్న పరిణామాలపై సమగ్రమైన విచారణ జరిపి ఆర్టీసీ డిఎం పై చర్యలు తీసుకొని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్పుల సురేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్యలు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: