Saturday, 13 June 2026 12:08:41 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

స్వీపింగ్ కార్మికుల నిరసన

మద్దతు తెలిపిన ప్రజా సంఘాల నాయకులు

Date : 05 June 2026 05:20 PM Views : 38

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ఆర్టీసీలో పని చేస్తున్న దళిత మహిళ కార్మికుల పట్ల ఆర్టీసి డీఎం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంథని బస్టాండ్ గేటు ముందు స్వీపింగ్ కార్మికులు చిప్ప చేత పట్టుకొని ధర్నా నిర్వహించి ప్రయాణికుల నుండి భిక్షాటన చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న దళిత మహిళ కార్మికుల పట్ల వివక్షత చూపుతూ డీఎం నియంతల వ్యవరిస్తున్నాడని అన్నారు. కార్మికులను ఇష్టాను రీతిలో తొలగిస్తూ ఇష్టాను రీతిలో తీసుకుంటున్నాడని విమర్శించారు. అంత్య పుష్కరాల సందర్భంగా ఒక కార్మికురాలును విధుల్లోకి తీసుకొని పారిశుద్ధ్య పనులు చేయించుకొని పుష్కరాలు పూర్తికాగానే విధుల నుండి తొలగించారన్నారు. కార్మికులను ఎందుకు తొలగించారని అడిగితే డిఎం, కాంట్రాక్టర్ ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకొని కార్మికుల మధ్యన చిచ్చురేపి కార్మికుల గొడవలకు కారణమవుతున్నారని విమర్శించారు. దళిత మహిళా కార్మికులు తమ గోడు వెళ్ళబుచుకుందామని డిఎం వద్దకు వెళితే కనీసం కలవనీయకుండా తమ సిబ్బందితో దళిత మహిళా కార్మికులను గేటు బయటకు గెంటేశాడని ఆరోపించారు. బస్టాండ్ అభివృద్ధి పేరిట లక్షలాది రూపాయలను ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అదే బస్టాండ్ లో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని, ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోలో జరుగుతున్న పరిణామాలపై సమగ్రమైన విచారణ జరిపి ఆర్టీసీ డిఎం పై చర్యలు తీసుకొని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్పుల సురేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్యలు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :