Friday, 31 July 2026 12:05:33 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

Date : 30 July 2026 09:29 PM Views : 6

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని రేషన్ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్2026 నెలలకుసంబంధించిన 3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి.రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్కడక్కడా సర్వర్ సంబంధిత సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ, ఈ-పాస్ ఇంజనీర్లు వాటిని వెంటనే పరిష్కరించి పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని, జిల్లాలో సన్నబియ్యం నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నందున ప్రతి అర్హులైన రేషన్ కార్డుదారునికి సన్నబియ్యం తప్పనిసరిగాఅందించడం జరుగుతుందని తెలిపారు.సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుందని, రేషన్ కార్డుదారులు తొందరపడకుండా, తమకుఅనుకూలమైన సమయంలో సంబంధిత రేషన్ దుకాణానికి వెళ్లి సన్నబియ్యాన్ని తీసుకోవచ్చని తెలిపారు. పంపిణీ కార్యక్రమాన్ని మండల స్థాయిలో సంబంధిత మండల తహసీల్దార్లు, జిల్లా స్థాయిలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిరంతరం పర్యవేక్షిస్తారని, జిల్లాలో ప్రస్తుతం 2 లక్షల 57 వేల 251 రేషన్ కార్డులు ఉన్నాయని, అర్హులైన ప్రతి కార్డుదారునికి 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణాల డీలర్లు, రేషన్ కార్డుదారులు అక్రమంగా పక్కదారి మళ్లించి విక్రయించినట్లయితే తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ (నియంత్రణ) ఆర్డర్–2016లోని సెక్షన్ 17(డి) ప్రకారం సంబంధిత రేషన్ డీలర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుందని, రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యాన్ని విక్రయించినట్లయితే వారి రేషన్ కార్డు రద్దు చేయడంతో పాటు వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :