Wednesday, 29 July 2026 07:23:14 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

Date : 10 October 2025 11:04 PM Views : 335

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నాయి బ్రాహ్మణ సేవ సంఘం భవన నిర్మాణం కోసం ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రూ. 20 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంథని పట్టణంలోని అంబేద్కర్ ప్రధాన కూడలి వద్ద శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మంథని నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవ సోదరులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అనంతరం జిల్లా ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి రాయమల్లు, మంథని సీనియర్ నాయకులు మంథని వేణుగోపాల్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు ప్రతి ఒక్క కులానికి, సంఘానికి భవన నిర్మాణాలు నిధులు మంజూరు చేశారన్నారు. అందులో భాగంగానే నాయి బ్రాహ్మణ సేవా సంఘంకు రూ. 20 లక్షలు సాంక్షన్ చేశారన్నారు. అణగారిన వర్గాలను ఆదుకున్న ఘనత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకే దక్కుతుందన్నారు. నాయి బ్రాహ్మణ సేవ సంఘం భవనానికి నిధులు కేటాయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని రామ్ చందర్, విష్ణుభక్తుల రఘు, మంథని రమేష్, మంథని సతీష్, విష్ణు భక్తుల భాను, మంథని లక్ష్మణ్, మంథని సాగర్, మంథని శ్రీనివాస్, మంథని కిషన్, మంథని సదాశివ్, మంథని సది, సమ్మెట చంద్రశేఖర్, మంథని సాయికుమార్, మంథని సూరి, మంథని ప్రదీప్, అడ్డూరి సాయి కిరణ్, అడ్దూరి చరణ్, మంథని వంశీ, వొల్లాది లక్ష్మణ్, విష్ణు భక్తుల శరత్, సిలువేరు సతీష్, మరియు క, గోటికార్ కిషన్, ఊదరి శంకర్, రవితేజ గౌడ్, ఆరెల్లి కిరణ్ గౌడ్, అజీం ఖాన్, దోరగొర్ల శ్రీనివాస్, మంథని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :