ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నాయి బ్రాహ్మణ సేవ సంఘం భవన నిర్మాణం కోసం ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రూ. 20 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంథని పట్టణంలోని అంబేద్కర్ ప్రధాన కూడలి వద్ద శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మంథని నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సేవ సోదరులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అనంతరం జిల్లా ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి రాయమల్లు, మంథని సీనియర్ నాయకులు మంథని వేణుగోపాల్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు ప్రతి ఒక్క కులానికి, సంఘానికి భవన నిర్మాణాలు నిధులు మంజూరు చేశారన్నారు. అందులో భాగంగానే నాయి బ్రాహ్మణ సేవా సంఘంకు రూ. 20 లక్షలు సాంక్షన్ చేశారన్నారు. అణగారిన వర్గాలను ఆదుకున్న ఘనత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకే దక్కుతుందన్నారు. నాయి బ్రాహ్మణ సేవ సంఘం భవనానికి నిధులు కేటాయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని రామ్ చందర్, విష్ణుభక్తుల రఘు, మంథని రమేష్, మంథని సతీష్, విష్ణు భక్తుల భాను, మంథని లక్ష్మణ్, మంథని సాగర్, మంథని శ్రీనివాస్, మంథని కిషన్, మంథని సదాశివ్, మంథని సది, సమ్మెట చంద్రశేఖర్, మంథని సాయికుమార్, మంథని సూరి, మంథని ప్రదీప్, అడ్డూరి సాయి కిరణ్, అడ్దూరి చరణ్, మంథని వంశీ, వొల్లాది లక్ష్మణ్, విష్ణు భక్తుల శరత్, సిలువేరు సతీష్, మరియు క, గోటికార్ కిషన్, ఊదరి శంకర్, రవితేజ గౌడ్, ఆరెల్లి కిరణ్ గౌడ్, అజీం ఖాన్, దోరగొర్ల శ్రీనివాస్, మంథని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News