Sunday, 13 September 2026 01:12:39 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

విద్యార్థులకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన..

స్కూల్ విద్యార్థులచే "ఖాకీ కిడ్స్" పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 22 February 2026 02:33 PM Views : 156

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా "ఖాకీ కిడ్స్" పేరుతో నూతన కార్యక్రమాన్ని శనివారంఉదయం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ ఆవరణ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లాంచనంగా ప్రారంభించారు. రాష్ట్ర డిజిపి. బి. శివధర్ రెడ్డి చే ప్రారంభించబడిన "అరైవ్ అలైవ్" లో భాగంగా,ఈకార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలు ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు "ఖాకీ కిడ్స్" గా మారనున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కానిస్టేబుల్ ని ఎంపిక చేసి ఈ కానిస్టేబుల్ ప్రతి వారంలో మూడు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఫై మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి వారిని "ఖాకీ కిడ్స్" గా మార్చనున్నారు. అవగాహన పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా పోలీసు శాఖ తరపున ఒక బ్యాడ్జిను అందజేయడం జరుగుతుందన్నారు. వీరు తమతో పాటుగా తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను చుట్టుపక్కల వాళ్ళని వారికి తెలిసిన ప్రతి ఒక్కరిని హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని, రోడ్డుపై ట్రిబల్ రైడింగ్, కార్ల నందు సీట్ బెల్ట్, రాజ్ డ్రైవింగ్ జరగకుండా ప్రోత్సహించి ప్రమాదాలను అరికట్టేలా తమ వంతు పాత్ర పోషించాలని పోలీసు వ్యవస్థకు సహకరించి ప్రాణనష్టాన్ని తగ్గించాలని తెలిపారు. అదేవిధంగా దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడానికి అవగాహన మాత్రమే ఉపయోగపడుతుందని, అవగాహన కల్పించి చైతన్య పరచడంతో సైబర్ నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. వీరందరికీ ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న నూతన సైబర్ క్రైమ్ పద్ధతులను సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న తీరులను వివరించి చైతన్యపరచాలని తెలిపారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఆర్థిక నేరాలలో గోల్డెన్ హవర్ ప్రాముఖ్యతను తెలియజేయాలని తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు ఇంటర్నెట్ వాడటం ద్వారా వాటిచే జరిగే దుర్వినియోగం, ఆన్లైన్ మోసాలు, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి పరిపాలన పి. మౌనిక ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, కె స్వామి, ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, రిసర్వ్ ఇన్స్పెక్టర్లు టి మురళి, ఎన్ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :