Monday, 14 September 2026 05:43:29 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాత్రికేయులు కడారి బాలేశం నియామకం..

Date : 20 March 2026 07:13 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంని నియమించి నట్లుగా సంఘం జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి ప్రకటించారు. గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని అధి కారికంగా ప్రారంభించారు. 30 యేండ్లుగా జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో కొనసాగు తున్న కడారి బాలేశం సేవ లు జర్నలిస్టుల హక్కుల కోసం ఉపయోగపడతా యనే ఉద్దేశ్యంతో బాలేశంకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష బాధ్యతలను అప్పగిచ్చినట్లు జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి శుక్రవారంతెలిపారు. సీనియర్ జర్నలిస్టు కడారి బాలేశం జర్నలిస్టుల సంక్షేమ సంఘంలోకి రావడం ఆనందించాల్సిన పరిణామమని, జర్నలిజం లో ఆయనకు ఉన్న అను భవం సంఘ బలోపేతానికి ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్‌లో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం బాలేశం వంటి సీనియర్ల సేవలు వినియోగించుకుని బలమైన కార్యాచరణతో ముందుకు నడిచి తెలంగాణ జర్నలిస్టుల పక్షాన గట్టిగా కొట్లాడతామని మానసాని కృష్ణారెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టు హక్కుల సాధన కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులను తమతోకలిసిపనిచేయడా నికి రావాలని, వారిక సంఘంలో తగిన ప్రాతినిధ్య ఇస్తామని ఈ సందర్భంగా కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా తన మీద నమ్మకంతో నియమించినందుకు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్,జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి కి ఈ సందర్భంగా కడారి బాలేశం ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్ల కమిటీలను త్వరలోనే పూర్తి చేసి భారీ సభను నిర్వహించి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని కడారి బాలేశం తెలిపారు. రానున్న రోజుల్లో సంఘ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేసి రాష్ట్రంలోనే బలమైన గుర్తింపు జర్నలిస్టుల సంఘంగా ఏర్పడటానికి జాతీయ, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తానని బాలేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చీకట్ల శ్రీనివాస్, జూబ్లిహిల్స్ డివిజన్ సంఘ బాధ్యులు శాసనాల సురేశ్, సీనియర్ పాత్రికే యులు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. మార్చి నెలాఖరులో కరీంనగర్‌లో ఉత్తర తెలంగాణ సభ... మార్చినెలాఖరులో ఉత్తర తెలంగాణ జర్నలిస్టుల సభను కరీంనగర్ పట్టణంలో నిర్వహించ డానికి నిర్ణయించినట్లుగా జర్నలిస్టుల సంక్షేమ సంఘం బాధ్యులు తెలిపారు. ఈ సభ ద్వారా భారీ సంఖ్యలో జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సభ్యత్వాల నమోదు చేయడానికి ప్రణాళికను రూపొందించినట్లుగా వారు తెలిపారు. ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సీనియర్ పాత్రికేయులు, వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు భారీ సంఖ్యలో చేరడానిక ఆసక్తిచూపుతున్నారని వారు తెలిపారు.రానున్న రోజుల్లో అత్యధిక సభ్యత్వం కల సంఘంగా ఏర్పడటం ఖాయమని సంఘ బాధ్యులు ధీమా వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :