Wednesday, 29 July 2026 01:36:58 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

గిట్టుబాటు ధర చెల్లించి నల్లబడ్డ పత్తిని కొనుగోలు చేయాలని తాసిల్దారుకు వినతి

Date : 27 October 2025 06:51 PM Views : 310

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, నల్ల బారీన పత్తిని కూడా కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి కొనుగోలు సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో సోమవారం లక్షెట్టిపేట తాసిల్దార్ దిలీప్ కుమార్ కు వినతిపత్రంఅందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘంరాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. లాల్ కుమార్ మాట్లాడుతూ రైతే రాజు అంటూ, రైతే దేశానికి వెన్నెముక అంటూనే రైతాంగం నడ్డి విరుస్తున్నారని అన్నారు. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో రైతు పండించిన పంట పత్తి వర్షాల కారణంగా నల్లబా రి పోతుంది దీని సాకుగా చూసుకొని సీసీఐ సెంటర్లు పత్తి నల్ల మారుతుంది. ఇందులో తేమ శాతం ఎక్కువ ఉంది అని కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు పడుతున్నారన్నారు . అకాల వర్షాలతో పత్తి వేపు సరిగ్గా రాక పంట నష్టపోయిన రైతులు పెట్టిన పెట్టుబడి రాక రైతులు బాధపడుతున్న పరిస్థితి ఉందన్నారు . ఇలాంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని సెంటర్లలో రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసి పత్తికి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా వరి ధాన్యం కింద పడిపోయి, వర్షాల కారణంగా వరి ధాన్యం తడిసి మొలికెత్తే పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి కావాల్సిన మౌలిక సౌకర్యాలు కొనుగోలు సెంటర్లలో కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. కనీసం పంటకు రక్షణ కల్పించలేకపోతున్నారని దుయ్యబెట్టారు. అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప, పాలకుల చేతలు గడప దాటడం లేదని ఎద్దేవ చేశారు. ఐకెపి సెంటర్స్ లలో దాన్యం తడవకుండా తాట్ పత్రిలు అందిచాలని డిమాండ్ చేశారు. రైతుల కు కావలసిన అన్ని రకాల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐకెపి సెంటర్లో నిబంధనలు పాటించాలి. కనీసం టోల్ ఫ్రీ సిస్టం పెట్టాలని తెలిపారు.లేనియెడల పెద్ద మొత్తంలో రైతు అందర్నీ ఏకం ఉద్యమాన్ని ఉద్రుత్వం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా ఉపాధ్యక్షులు దొండ ఏఐకేఎంఎస్ ప్రభాకర్, శంకరి సత్యం, ఏఐకేఎంఎస్ నాయకులు సాగర్, రవి, కిష్టన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :