ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, నల్ల బారీన పత్తిని కూడా కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి కొనుగోలు సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో సోమవారం లక్షెట్టిపేట తాసిల్దార్ దిలీప్ కుమార్ కు వినతిపత్రంఅందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘంరాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. లాల్ కుమార్ మాట్లాడుతూ రైతే రాజు అంటూ, రైతే దేశానికి వెన్నెముక అంటూనే రైతాంగం నడ్డి విరుస్తున్నారని అన్నారు. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలతో రైతు పండించిన పంట పత్తి వర్షాల కారణంగా నల్లబా రి పోతుంది దీని సాకుగా చూసుకొని సీసీఐ సెంటర్లు పత్తి నల్ల మారుతుంది. ఇందులో తేమ శాతం ఎక్కువ ఉంది అని కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు పడుతున్నారన్నారు . అకాల వర్షాలతో పత్తి వేపు సరిగ్గా రాక పంట నష్టపోయిన రైతులు పెట్టిన పెట్టుబడి రాక రైతులు బాధపడుతున్న పరిస్థితి ఉందన్నారు . ఇలాంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని సెంటర్లలో రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసి పత్తికి వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా వరి ధాన్యం కింద పడిపోయి, వర్షాల కారణంగా వరి ధాన్యం తడిసి మొలికెత్తే పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి కావాల్సిన మౌలిక సౌకర్యాలు కొనుగోలు సెంటర్లలో కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. కనీసం పంటకు రక్షణ కల్పించలేకపోతున్నారని దుయ్యబెట్టారు. అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప, పాలకుల చేతలు గడప దాటడం లేదని ఎద్దేవ చేశారు. ఐకెపి సెంటర్స్ లలో దాన్యం తడవకుండా తాట్ పత్రిలు అందిచాలని డిమాండ్ చేశారు. రైతుల కు కావలసిన అన్ని రకాల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐకెపి సెంటర్లో నిబంధనలు పాటించాలి. కనీసం టోల్ ఫ్రీ సిస్టం పెట్టాలని తెలిపారు.లేనియెడల పెద్ద మొత్తంలో రైతు అందర్నీ ఏకం ఉద్యమాన్ని ఉద్రుత్వం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా ఉపాధ్యక్షులు దొండ ఏఐకేఎంఎస్ ప్రభాకర్, శంకరి సత్యం, ఏఐకేఎంఎస్ నాయకులు సాగర్, రవి, కిష్టన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News