Wednesday, 29 July 2026 10:13:22 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఏఐ కంపెనీల మీద ప్రత్యేక పన్ను విధిస్తాం.. సీఎం.రేవంత్ రెడ్డి

Date : 29 March 2026 12:48 AM Views : 109

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారంఒక విచిత్రమైన ప్రతిపాదన చేశారు. తమ ప్రభుత్వం ఏఐ కంపెనీల మీద ప్రత్యేక పన్ను వేసి, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తాం అని నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో పాల్గొంటూ అన్నారు. దీంతో ఆ సదస్సులో పాల్గొంటున్న వివిధ ఏఐ నిపుణులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడిందట. అసలు ఏఐ కంపెనీలకు వివిధ రాయితీలు ఇచ్చి ప్రపంచ దేశాలు అన్నీ ఆహ్వానిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన చాలామందిని అయోమయపరచింది. ఎందుకంటే అసలు ఐటీ కంపెనీల మీద, అది కూడా బహుళజాతి ఐటీ కంపెనీల మీద ఒక రాష్ట్రం పన్ను వేయడం సాధ్యమా? ఒకవేళ నిజంగానే అలాంటి పన్ను వేస్తే ఆ కంపెనీలు తెలంగాణకు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నలు ఐటీరంగ నిపుణులు వేస్తున్నారు. అసలే పెట్టుబడులు రాక రాష్ట్రం సతమతం అవుతున్న ఈ సమయంలో ఇలాంటి అసందర్భపు ప్రకటనలతో రావాలనుకునే కంపెనీలు కూడా పునరాలోచించుకునేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.తన అజ్ఞానంతో ఇప్పటికే రాష్ట్ర ప్రజల ముందు పరువు పోగొట్టుకుంటున్న రేవంత్, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సదస్సుల్లో కూడా రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నాడు అని మీడియావర్గాల్లో టాక్. ఇక ఆయన ప్రసంగాల వీడియోలు బయటికి వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటం వల్ల ఈ మధ్య ఇటువంటి వీడియోలు బయటికి రాకుండా ఆయన పీఆర్ టీం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :