Tuesday, 28 July 2026 06:58:52 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఏఐఎఫ్టిపి దక్షిణ భారత విభాగం నిర్వాహణ కమిటీ సంయుక్త కార్యదర్శి గా నగేష్ రంగి

Date : 13 January 2026 09:34 PM Views : 118

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హైదరాబాద్ లో ప్రముఖ టాక్స్ అడ్వకేట్ నగేష్ రంగి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టిషనర్స్ (ఏఐఎఫ్టిపి) దక్షిణ భారత విభాగం నిర్వాహణ కమిటీలో సంయుక్త కార్యదర్శిగా 2026 గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఈ పదవికి మంథని చెందిన న్యాయవాది జాతీయ స్థాయిలో ఎంపిక కావడం విశేషం. దేశవ్యాప్తంగా వేలాది టాక్స్ ప్రాక్టిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఐ ఎఫ్ టి పి వంటి ప్రతిష్టాత్మక జాతీయ సంఘంలో దక్షిణ భారత విభాగంలో సంయుక్త కార్యదర్శి గా పదవి పొందటం ఆనందంగా ఉందని రంగి నగేష్ తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా వృత్తి పరమైన నైపుణ్యం, సంస్థాగత అనుభవం, నాయకత్వ ప్రతిభకు జాతీయ స్థాయిలో సంపూర్ణ గుర్తింపు లభించినట్లు భావిస్తున్నారు.

గతంలో నగేశ్ రంగి తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వరుసగా రెండు పర్యాయములు బాధ్యతలు చేపట్టి, సంఘాన్ని సుస్థిరమైన మార్గంలో ముందుకు నడిపించారు. 2025లో సదరన్ జోన్ తెలంగాణ సమన్వయకర్త గా బాధ్యతలు నిర్వర్తించారు. వీరు సంఘ సభ్యుల సంక్షేమం, వృత్తి పరమైన సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో నిరంతర కృషి చేస్తున్నారు. సంఘ అభివృద్ధికి విశేష సేవలు అందించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల టాక్స్ ప్రాక్టిషనర్ల సమస్యలను ఉన్నత వేదికలపై ప్రస్తావించారు. జీఎస్‌టి అమలు, చట్టపరమైన మార్పులు, ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న సవాళ్లపై అనేక అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

వృత్తి పట్ల అపారమైన అంకితభావం, నాయకత్వ సామర్థ్యం, క్రమశిక్షణతో కూడిన నిరంతర సేవలను పరిగణనలోకి తీసుకున్న ఏఐఎఫ్టిపి జాతీయ నాయకత్వం రంగి నగేష్ తో పాటు తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా వాసి ఉల్లిబోయిన సైదులు 2026–27 కాలానికి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆప్టెడ్ సభ్యలు గా వసంత కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ ఎన్నిక ద్వారా తెలంగాణ నుండి, జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం లభించిందని వృత్తి వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సదరన్ జోన్ లో వీరితో పాటు తెలంగాణ నుండి టి వి సుబ్బారావు సమన్వయకర్తగా, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా హైదరాబాద్ నుండి విఠల్ రామరాజు, కాట్రగడ్డ నరేంద్రబాబు, కె.నర్సింగ రావు, రమణమూర్తి, బాలకృష్ణ, సమ్మయ్య, దుర్గాప్రసాద్ రావు ఖమ్మం, మల్లికార్జున్ దేవ్ కరీంనగర్, వెంకటరమణ, నల్గొండ తదితరులు ఎన్నికైన్నారు. ఈ నియామకం యువ టాక్స్ ప్రాక్టిషనర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర టాక్స్ ప్రాక్టీషనర్ల సమస్యలను జాతీయ వేదికపై మరింత బలంగా ప్రస్తావించేందుకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నియామకంతో కష్టపడి పనిచేస్తే జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధ్యమేనన్న నమ్మకాన్ని బలపరుస్తోందని తెలియజేసారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: