ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామ సర్పంచ్గా ఇటీవల గెలుపొందిన ప్రజా సేవకులు, ప్రజా నాయకుడు గుడిసె గట్టయ్య యాదవ్ ను యాదవ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధి రమేష్ యాదవ్ సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ కాంటెస్టెడ్ మెంబర్ పొన్నం రవీందర్ యాదవ్ పాల్గొని గుడిసె గట్టయ్య యాదవ్ను అభినందించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో గుడిసె గట్టయ్య యాదవ్ అంకితభావంతో పనిచేస్తారని, సర్పంచ్గా కన్నాల గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, యాదవ సమాజం నుంచి ప్రజా ప్రతినిధులు ఎదగడం గర్వకారణమని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని గుడిసె గట్టయ్యకు సూచించారు.
Admin
E Nivas News