ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలోవిద్యార్థులకు అందజేసిన స్కూల్ యూనిఫారాలు అప్పుడే చినిగిపోవడం, మరి కొన్ని చోట్ల సరైన కొలతలు లేకుండా అందజేయడం పట్ల హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. మాట్లాడితే ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అనే మీరుప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారా? ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డిని నిలదీశారు. దళారులపై ఉన్న ప్రేమ చేనేత కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో ఒకచోట యూనిఫారాలు అంత లేదని విమర్శించారు. అందినచోట కొలతలు సరిగ్గా లేవు కదా కుట్లు ఓడిపోతున్నాయన్నారు. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయి. రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా, చాలా చోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ చేనేత కార్మికులపై లేదని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించి విద్యార్థులకు, చేనేత కార్మికులకు అన్యాయం చేశారని విమర్శింశారు. విచారణ జరిపించండి: "మఫత్లాల్ ముద్దు.. చేనేత వద్దు" అన్నదే ప్రభుత్వ వైఖరిగా మారిందా? అని హరీశ్ రావు నిలదీశారు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందజేశారన్నారు. దీంతో విద్యార్థులకు కష్టం తప్పడం లేదన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి నష్టం అన్నారు. నాసీరకం యూనిఫామ్లపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Admin
E Nivas News