ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతు భరోసా కొత్త అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. కావాల్సిన పత్రాలు ఇలా ఉన్నాయి. రైతుల ఖాతాల్లో ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 'రైతు భరోసా' పొందని రైతులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. కొత్తగా రైతుల నుంచి రైతు భరోసాకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది. కొత్తగా పట్టా పొందిన (28.02.2026 లోపు) రైతులు దీనికి అర్హులు. రైతు వేదికలు, వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి అప్లికేషన్లు ఇవ్వొచ్చు. అందుకు రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది.
Admin
E Nivas News