ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కేంద్రంలో ని భక్త మార్కండేయ దేవాలయం వద్ద పద్మశాలి సం ఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ ఆధ్వ ర్యంలో భక్త మార్కండేయ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణంలో ఉన్న భక్త మార్కండేయ ఆలయం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శివలిం గానికి అభి షేక కార్యక్రమాలు నిర్వ హించారు. అనంతరం గణ పురం మండలం చెల్పూరు గ్రామంలో పద్మశాలి కుల బాంధవులు నిర్వహించిన భక్త మార్కండేయ జయంతి కార్యక్రమంలో పాల్గొన డం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, పద్మ శాలి కుల వంశోద్ధా రకుడు, ధర్మ పరిరక్షకుడు అయిన భక్త మార్కండేయుని జయంతిని ఘనంగా జరుపు కోవడం గర్వకారణమన్నారు. చిన్న వయస్సులోనే శివభక్తితో సత్య ధర్మ మార్గంలో నడిచి మృత్యు వును జయించిన మహాను భావుడిగా ఆయన ఆదర్శా లు నేటి యువతకుమార్గ దర్శకమని పేర్కొన్నారు. పద్మశాలి కులం ఐక్యంగా నిలిచి విద్య, ఉపాధి, సామాజిక సేవల రంగాల్లో ముందుండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగవతం బిక్షపతి, గోనె భాస్కర్, శేరు కుమారస్వామి, గుండ వీరస్వామి, పేరాల వెంకటేశం, పాసికం టి శ్రీనివాస్, కుసుమ కృష్ణ మోహన్, భీమనాధిని సత్య నారాయణ, తౌటం ప్రభాకర్, అంకం నర్సయ్య, మామిడాల రవీందర్ లతొ పాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News