ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఈరోజు శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో మన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమం"రెండేళ్ల సుపరిపాలన - అభివృద్ధి సంక్షేమం" ఇంటింటా ప్రచారం ఆత్మకూరు మున్సిపాలిటీ నందు క్లస్టర్ ఇంచార్జ్ & సింగల్ విండో చైర్మన్ ఏ.షహబుద్ధిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఎ.షహాబుద్దీన్ మాట్లాడుతూ గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనులను, సంక్షేమం గురించి వివరిస్తూ త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు సుబ్బరాజు, పర్వీన్, జిలాని బి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News