Thursday, 30 July 2026 12:41:06 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర..

Date : 29 March 2026 09:40 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఆమోద ముద్ర వేసింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనం నుంచిరూ.10 వేల వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమయ్యేలా ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ చట్టం పరిధిలోకి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను తీసుకువస్తూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.తల్లిదండ్రుల హక్కులు కాపాడాలన్నదే నా ధ్యేయం అన్నారు. అంతకుముందు తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తల్లిదండ్రుల కోసం సామాజిక బాధ్యతగా చట్టం తీసుకు వచ్చామన్నారు. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలనే చట్టం తెచ్చామని స్పష్టం చేశారు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై బిల్లు తేవడం బాధాకరమేనని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. పిల్లలు భక్తితో కాకపోయినా భయంతోనైనా తల్లిదండ్రులను చూసుకోవాలన్నదే తమ ప్రయత్నమని స్పష్టం చేశారు.పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని వివరించారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చామని సీఎం రేవంత్‌ వివరించారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వారిని సామాజికంగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2007లో వృద్ధుల కోసం కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించకుండా ఇవ్వాలని అందులో ఉందని తెలిపారు. అందుకే తాము తెచ్చిన చట్టంలో రూ.10 వేల నిబంధన పెట్టినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదని,ప్రజా ప్రతినిధులకూ సైతం వర్తిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ చర్చలో రామాయణంలోని శ్రావణకుమారుడి కథతోపాటు రేమాండ్స్ సంస్థ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి క్లుప్తంగా వివరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :