ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రూ.44 లక్షలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన టెన్నిస్ కోర్టును బుధవారం ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం టెన్నిస్ కోర్టు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు ఆన్ చేసి క్రీడాకారులతో టెన్నిస్ ఆడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పిఈటిలు మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్షను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంథని ఆర్డిఓ సురేష్, ఎమ్మార్వో కుమారస్వామి, ఎఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, పిఈటిలు దొమ్మటి రవీందర్, కొమరోజు శ్రీనివాస్, కొమురోజు కృష్ణ, క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News