ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా జడ్పీహెచ్ఎస్ ఏక్లాస్పూర్ విద్యార్థులు బసంత్ నగర్ లోని కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీని శనివారం సందర్శించారు. బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలోని రా మెటీరియల్ ఐరన్, జిప్సం ఏ విధంగా క్రషర్ చేస్తారు అదేవిధంగా బొగ్గుతో వేడి చేసి సిమెంట్ గా మార్చే విధానం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. తర్వాత సిమెంట్ బ్యాగులను నింపి మిషన్ సహాయంతోనే గూడ్స్ రైల్లో ఎక్కించే విధానము ఆటోమేటిక్ సిస్టంతో నడిచే వివిధ భాగాలను పరిశీలించి సిమెంట్ తయారీ విధానం పూర్తిగా ప్రాక్టికల్ గా జడ్పీహెచ్ఎస్ ఎక్లాస్పూపూర్ విద్యార్థులకు తెలిపినట్లు హెడ్మాస్టర్ జి జ్యోతి పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ విజిట్ బృందంలో సంతోష్, డాక్టర్ రవి దొమ్మటి, సుచిత్ర రాజశేఖర్ ,అన్నం శ్రీనివాస్, మంజుల, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News