Saturday, 13 June 2026 02:24:10 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం..

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 15 January 2026 08:52 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం ద్వారామంచిర్యాల నియోజకవర్గంలోని సాగు భూములలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని తానిమడుగు వద్ద గల గూడెం ఎత్తిపోతల పథకం నుండి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నీటిపారుదల శాఖ ఇతర అధికారులతో కలిసి సాగునీటి పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గూడెం ఎత్తిపోతల పథకం నుండి సాగు భూముల చివరి ఆయకట్టు వరకు పంట సాగుకు అవసరమైన నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు అవసరం అయిన నీటిని ప్రణాళిక బద్ధంగా విడుదల చేయడం జరుగుతుందని, ఈ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం సాగు సకాలంలో ప్రారంభించాలని, ఆలస్యంగా సాగు చేయడం వలన ఇబ్బందులు ఎదురవుతాయని, సాగుకు అవసరమైన నీటిని సకాలంలో అందిస్తామని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టి ఎం సి ల నీరు ఉందని, కార్యచరణ ప్రకారం సాగునీరు, త్రాగునీటికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో పంట సాగుకు అవసరమైన సాగునీటిని పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు అందించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పైప్ లైన్ల మరమ్మత్తులను చేపట్టి పనులు పూర్తి చేసి సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :