Wednesday, 29 July 2026 08:16:12 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం..

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 15 January 2026 08:52 PM Views : 243

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం ద్వారామంచిర్యాల నియోజకవర్గంలోని సాగు భూములలో చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని తానిమడుగు వద్ద గల గూడెం ఎత్తిపోతల పథకం నుండి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నీటిపారుదల శాఖ ఇతర అధికారులతో కలిసి సాగునీటి పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గూడెం ఎత్తిపోతల పథకం నుండి సాగు భూముల చివరి ఆయకట్టు వరకు పంట సాగుకు అవసరమైన నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు అవసరం అయిన నీటిని ప్రణాళిక బద్ధంగా విడుదల చేయడం జరుగుతుందని, ఈ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం సాగు సకాలంలో ప్రారంభించాలని, ఆలస్యంగా సాగు చేయడం వలన ఇబ్బందులు ఎదురవుతాయని, సాగుకు అవసరమైన నీటిని సకాలంలో అందిస్తామని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టి ఎం సి ల నీరు ఉందని, కార్యచరణ ప్రకారం సాగునీరు, త్రాగునీటికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో పంట సాగుకు అవసరమైన సాగునీటిని పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు అందించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పైప్ లైన్ల మరమ్మత్తులను చేపట్టి పనులు పూర్తి చేసి సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :