Tuesday, 15 September 2026 09:11:45 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే బిజెపి లక్ష్యం

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

Date : 01 January 2026 11:49 PM Views : 260

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రవల్లి రఘునాథ్ తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన గ్రామంలో 10 లక్షల రూపాయల స్వంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇచ్చిన హామీ మేరకు గురువారం లక్షెట్టిపేట మండలం లోని లక్ష్మీపూర్ గ్రామంలో సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థి సురమళ్ల సౌజన్య గెలవడంతో హామీ నెరవేర్పుకై గ్రామంలో నీటి సమస్య తీర్చడానికి రెండు బోర్ వెల్స్ కు సర్పంచ్ సురమళ్ల సౌజన్య ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ భూమి పూజ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గతంలో 10 సంవత్సరాలు బి ఆర్ ఎస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా గ్రామాలకు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, కారుకూరి మధుకర్, పెట్టం శ్రీరామ్, అప్పని శ్రీకాంత్, రంజిత్, కందుల వరక్క, ఇందూరి లింగయ్య, అప్పని గంగయ్య, చిన్న, కందుల లక్ష్మణ్, తగరపు గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :