Thursday, 30 July 2026 09:52:58 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే బిజెపి లక్ష్యం

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

Date : 01 January 2026 11:49 PM Views : 228

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రవల్లి రఘునాథ్ తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన గ్రామంలో 10 లక్షల రూపాయల స్వంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇచ్చిన హామీ మేరకు గురువారం లక్షెట్టిపేట మండలం లోని లక్ష్మీపూర్ గ్రామంలో సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థి సురమళ్ల సౌజన్య గెలవడంతో హామీ నెరవేర్పుకై గ్రామంలో నీటి సమస్య తీర్చడానికి రెండు బోర్ వెల్స్ కు సర్పంచ్ సురమళ్ల సౌజన్య ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ భూమి పూజ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గతంలో 10 సంవత్సరాలు బి ఆర్ ఎస్ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా గ్రామాలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా గ్రామాలకు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, కారుకూరి మధుకర్, పెట్టం శ్రీరామ్, అప్పని శ్రీకాంత్, రంజిత్, కందుల వరక్క, ఇందూరి లింగయ్య, అప్పని గంగయ్య, చిన్న, కందుల లక్ష్మణ్, తగరపు గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :