Thursday, 30 July 2026 12:29:47 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

68.90 లక్షల మందికి రైతు భరోసా..! ముందుగా ఎకరం లోపు రైతులకు

57.45 లక్షల ఎకరాలకు అందిన సహాయం..3,446.94 కోట్ల నిధులువిడుదల..

Date : 25 March 2026 08:03 AM Views : 126

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మరో 45 రోజుల్లో రెండు విడుతల్లో మిగతా నిధులు జమ కానున్నాయి. రాష్ట్రంలో ఎకరం వరకు భూములు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఆదివారం నర్మెట్టలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత జరిగిన సభలో సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 68,89,955 మంది రైతులకు రైతు భరోసా అందించారు. 57,44,907 ఎకరాల 19 గుంటలకు ఆ నిధులు రిలీజ్ చేశారు. రైతులందరికీ ఎకరం వరకు రూ.3446.94 కోట్లు విడుదల చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఆ నిధులు జమ చేయనున్నారు. మరో 45 రోజుల్లో మిగతా రూ.5,400 కోట్లను మరో రెండు విడతల్లో జమ చేయనున్నారు. ఎకరానికి ఏడాదికి రూ.12 వేల నిధులు కాగా యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు రైతులకు అందుతున్నాయి. రైతు భరోసాలో నల్గొండ టాప్... రైతు భరోసా నిధుల్లో నల్గొండ జిల్లా టాప్ లో నిలిచింది. ఈ జిల్లాలో 5,22,313 మంది రైతుల ఖాతాల్లో రూ.268.57 కోట్ల నిధులు జమ కానున్నాయి. తరువాత ఖమ్మం జిల్లాలో 3.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.169.51కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3.53 లక్షల మంది రైతుల అకౌంట్ లో రూ.167.80 కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 3.01లక్షల మందికి రూ.157.95 కోట్లు, సిద్ధిపేట జిల్లాలో 3.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.153.44 కోట్ల ని ధులు జమ చేయనున్నారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రూ.10.43 కోట్లు జమ కానున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :