ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం మంచిర్యాల కార్పొరేషన్ లో మంగళవారం నిర్వహించారు. మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45,22వ డివిజన్లలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, స్థానిక కార్పొరేటర్లు దోమల సునీత-లక్ష్మణ్, కంకణాల రోజా శ్యామ్ ల ఆధ్వర్యంలో మంచిర్యాల శుభ్రత -ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత (స్పెషల్ డ్రైవ్)లో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ 45,22 డివిజన్లలో ఉన్న సమస్యలను ప్రజలతో మాట్లాడి తెలుసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రజల మాకు డ్రైనేజీ సమస్య ఉందని చెప్పడం జరిగింది. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరగా డ్రైనేజీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అన్వేష్ అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.0
Admin
E Nivas News