ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరంగల్ ఎన్టీఆర్ నగర్కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్,డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్ బైక్పై ఎస్ఆర్ నగర్ నుంచి కోటి లింగాలగుడి మీదుగా ఎన్టీఆర్ నగర్కు శనివారం రాత్రి 11.30 గంటలకు బయలుదేరాడు. కోటిలింగా ల దేవాలయం సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతడు అదే వాహనంపై ఎన్టీఆర్ నగర్కు చేరుకొని కేకలు వేశాడు. వెంటనే కాలనీ వాసులు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. తనపై కాంగ్రెస్ నాయకులే పెట్రోల్ పోసి కాల్చారని చెప్పాడు. వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
Admin
E Nivas News