ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సైబర్ జగ్రూక్త దివాస్ ను పురస్కరించుకుని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గురువారం మంథని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని ఎస్సై డి. రమేష్ మాట్లాడుతు ప్రస్తుత సాంకేతిక రోజులలో అందరు సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏపీకే ఫైల్ ఓపెన్ చేయవద్దని, అపరిచిత ఫోన్ నెంబర్ల నుండి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని, అపరిచిత వ్యక్తులు చేసే వీడియో కాల్స్ కి స్పందించవద్దని, ఎవరికి ఓటిపి లు చెప్పవద్దని, ఆన్లైన్ ఉద్యోగాల మోసాలపై అవగాహన కలిగి ఉండాలని, అధిక డబ్బులు వస్తాయని ఆశపడి మోసపోవద్దని సూచించారు. ఎలాంటి డిజిటల్ అరెస్టులు లేవని ఎవరు అలాంటి వాటిని నమ్మవద్దని, ఏదైనా సైబర్ మోసం జరిగినట్టు గ్రహిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై మల్లేష్, సిబ్బంది, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
E Nivas News