Tuesday, 28 July 2026 07:01:08 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మంథనిలో అలరించిన త్యాగరాజ ఆరాధనోత్సవం

శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర ఆలయంలో 129 వ సంగీత విభావరి...! కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ తిరుపతయ్య బృందం

Date : 04 January 2026 06:42 PM Views : 316

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ కార్యక్రమం వైభవపీతంగా నిర్వహించారు. వరంగల్ కు చెందిన సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తిరుపతయ్య, ఇతర సంగీత గురువుల ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఆలపించిన శ్రీ త్యాగరాజ కీర్తనలు భక్తులను మంత్రముగ్గులను చేసింది. మంథనిలోని ఈ ఆలయంలో నిర్వహించిన 129వ శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మంథని సంగీత కళాశాలలో మృదంగం విధ్వాన్సులుగా విధులు నిర్వహిస్తున్న భీమా శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి కనకమాలక్ష్మి మాట్లాడుతూ మంథని భక్తికి, ఆరాధనకు నిలయమని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతినిత్యం సప్తహాలు, ఆలయాల్లో ఎక్కాహం, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస భక్తి కార్యక్రమాలు, శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నిర్వహించే కార్తీక మాసం భక్తి కార్యక్రమాలు, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు ఈ ప్రాంత భక్తి ప్రవృత్తులకు నిదర్శనమన్నారు. వరంగల్లోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో ప్రొఫెసర్ వెంకటరమణ సంగీత ల ఆధ్వర్యంలో ప్రతినెల మొదటి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు లోకే శరత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు న్యాయవాది లోకే రాధా కిషన్ రావు, లోకే శరత్ లను వారు సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ గాయకుల బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ సంగీత విద్వాంసకులు వి లక్ష్మణాచారి, ఎం సృజన్, షణ్ముఖ ప్రియా, మధులిక, సంతోష్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజ్యం, శ్రీరంభట్ల నరహరి, అవధానుల శ్రీనివాస్, రామడుగు శారద, రామడుగు శ్రీనివాస్, గట్టు మాధవి, మారుపాక నిఖిలతో పాటు అవదానుల మధు, రావి కంటి మనోహర్, కాచే జగన్, మహావాది సతీష్ కుమార్, జంబోజి రాజేశం, కొల్లారపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :