Friday, 11 September 2026 09:05:24 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

మంథనిలో అలరించిన త్యాగరాజ ఆరాధనోత్సవం

శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర ఆలయంలో 129 వ సంగీత విభావరి...! కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ తిరుపతయ్య బృందం

Date : 04 January 2026 06:42 PM Views : 362

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ కార్యక్రమం వైభవపీతంగా నిర్వహించారు. వరంగల్ కు చెందిన సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తిరుపతయ్య, ఇతర సంగీత గురువుల ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఆలపించిన శ్రీ త్యాగరాజ కీర్తనలు భక్తులను మంత్రముగ్గులను చేసింది. మంథనిలోని ఈ ఆలయంలో నిర్వహించిన 129వ శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మంథని సంగీత కళాశాలలో మృదంగం విధ్వాన్సులుగా విధులు నిర్వహిస్తున్న భీమా శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి కనకమాలక్ష్మి మాట్లాడుతూ మంథని భక్తికి, ఆరాధనకు నిలయమని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతినిత్యం సప్తహాలు, ఆలయాల్లో ఎక్కాహం, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస భక్తి కార్యక్రమాలు, శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నిర్వహించే కార్తీక మాసం భక్తి కార్యక్రమాలు, శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాలు ఈ ప్రాంత భక్తి ప్రవృత్తులకు నిదర్శనమన్నారు. వరంగల్లోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో ప్రొఫెసర్ వెంకటరమణ సంగీత ల ఆధ్వర్యంలో ప్రతినెల మొదటి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు లోకే శరత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్వాహకులు న్యాయవాది లోకే రాధా కిషన్ రావు, లోకే శరత్ లను వారు సన్మానించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ గాయకుల బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంథని పట్టణ సంగీత విద్వాంసకులు వి లక్ష్మణాచారి, ఎం సృజన్, షణ్ముఖ ప్రియా, మధులిక, సంతోష్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజ్యం, శ్రీరంభట్ల నరహరి, అవధానుల శ్రీనివాస్, రామడుగు శారద, రామడుగు శ్రీనివాస్, గట్టు మాధవి, మారుపాక నిఖిలతో పాటు అవదానుల మధు, రావి కంటి మనోహర్, కాచే జగన్, మహావాది సతీష్ కుమార్, జంబోజి రాజేశం, కొల్లారపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: