Tuesday, 28 July 2026 08:45:35 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

వసతి గృహ విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్

Date : 03 February 2026 10:48 PM Views : 159

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ - ఉట్నూర్ అధికారి యువరాజ్ మార్మాట్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలు (బాలికలు), లక్షెట్టిపేట, జన్నారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు( బాలూరు) లను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలలోవసతి గృహాలలో నెలకొన్న సమస్యలు, మెనూ ప్రకారం భోజనం పంపిణీ, ఆహారం రుచి, మెనూ అమలు వివరాలు తెలుసుకొని, తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు వండిన ఆహారం రుచిని తెలుసుకొని, కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించి, ఆరోగ్య కార్యకర్తలతో లతో ఐ.టి.డి.ఎ. పల్స్ యాప్ పని తీరుపై ఆరా తీశారు. పల్స్ యాప్ పై ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలుగల ఆహారాన్ని అందించాలని ప్రిన్సిపల్, సంక్షేమ అధికారి, కామాటీ, వంట పని వారు, పారిశుద్ధ్య, మల్టీపర్పస్ వర్కర్లకు సూచించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా వసతి గృహ పరిసరాలలో నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి రోజు వంటగది, స్టోర్ రూమ్, త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :