Tuesday, 28 July 2026 11:42:46 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

విద్యార్థి జీవితంలో క్రీడలు కూడా ఒక భాగమే...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 11 November 2025 06:36 PM Views : 266

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థి జీవితంలో క్రీడలు కూడా ఒక భాగమేనని, విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల కళాశాలలో మంగళవారం అండర్ 14 -19 అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందన్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆడే క్రీడాకారులంతా దాదాపుగా గ్రామస్థాయి నుండి వచ్చిన వారేనని తెలిపారు. క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో ఆడుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పాటు ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వెళ్లాలన్నారు.ముందుగా కలెక్టర్,అదనపు కలెక్టర్లకు పాఠశాల విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖఅధికారి భాగ్యవతి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మండల విద్యాధికారిణి శైలజ, పాఠశాల ప్ ప్రిన్సిపాల్ లు సిహెచ్ మంగ, నాగచంద్రిక, ఏటీపీ తిరుమల్, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :