ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థి జీవితంలో క్రీడలు కూడా ఒక భాగమేనని, విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల కళాశాలలో మంగళవారం అండర్ 14 -19 అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందన్నారు. ఇప్పుడు జాతీయస్థాయిలో ఆడే క్రీడాకారులంతా దాదాపుగా గ్రామస్థాయి నుండి వచ్చిన వారేనని తెలిపారు. క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో ఆడుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పాటు ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని వెళ్లాలన్నారు.ముందుగా కలెక్టర్,అదనపు కలెక్టర్లకు పాఠశాల విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖఅధికారి భాగ్యవతి, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మండల విద్యాధికారిణి శైలజ, పాఠశాల ప్ ప్రిన్సిపాల్ లు సిహెచ్ మంగ, నాగచంద్రిక, ఏటీపీ తిరుమల్, ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News