ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : న్యూఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిర్వహించిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు, మహిళలు మరియు ఇతరఆందోళనకారులపైపోలీసులుదురుసుగా వ్యవహరించి, లాఠీచార్జ్తో పాటు గ్యాస్ బాంబులు ప్రయోగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈఘటనలోపలువురు గాయపడగా, బాధితులు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఆర్ఎంఎల్ ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పిల్లలు, మహిళలు, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పోలీసులు ఈ విధంగా దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని ఎంపీ అన్నారు.ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, ఆహక్కులను అణచివేసే విధంగా పోలీసులు వ్యవహరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, వారికి అవసరమైన అన్ని విధాలా అండగా ఉంటామని ఎంపీ భరోసా ఇచ్చారు.
Admin
E Nivas News