ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మువ్వన్నెల పథకాలు ఎగరవేసి జరుపుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో అలాగే పలు రాజకీయ పార్టీలు యువజన సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల పథకాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయాలలో పరేడ్ గ్రౌండ్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ పెద్దలు తెచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత అని తెలిపారు. విద్యార్థి దశ నుండి అలవాట్లు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో రాణిస్తారని అటువంటి వారికి నైతిక విలువల విలువ తెలుస్తుంది అన్నారు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస క్రీడలు పలు అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలైన బహుమతులకు బహుమతులు అందజేశారు. అలాగే పలు శాఖలలో పలువురు ఉన్నతాధికారులుగా ఎంపిక కావడంతో వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రశంసా పత్రాలు అందజేశారు.
Admin
E Nivas News