ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సార్ అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. గురువారంజిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప విద్యావేత్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలను ఆచరణలో కొనసాగించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు.
Admin
E Nivas News