ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాజన్న జిల్లా వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరపడానికి అధికారులు సిద్ధం చేశారు. తెలుగు పంచాంగం ప్రకారంచైత్రమాసం శుక్లపక్షం నవమి,తిథిన వచ్చే శ్రీరామనవమి పండుగను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయఈవో రమాదేవి, తెలిపారు . ఈ నెల 27న జరగనున్న సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయ అధి కారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణానికి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.ఈ సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులకు సులభంగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాటుచేయాలన్నారు. ఎండలు కూడా మండుతు న్నందున వారి అవసరాల కు అనుగుణంగా తాగు నీరు సదుపాయాలను ఎక్కడికక్కడ కల్పించా లన్నారు. పార్కింగ్ పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తులకు అవసరమయ్యే ప్రసాదాలను తయారు చేయాలన్నారు. పటిష్టమైన భద్రత కల్పించే విధంగా చూడాలన్నారు.భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకు నేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఈవో ఆదేశాలు జారీ చేశారు.
Admin
E Nivas News