ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి శివారులోని ముత్తేబుచ్చయ్య పల్లె గ్రామ సమీపంలో డిసెంబర్ 2న సాయంత్రం హార్వెస్టర్ ఢీకొని బలరావుపేట గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్ అనే 48 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా,మెంగని మధుకర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు మల్లేష్ మధుకర్ణి బైక్ పై ఎక్కించుకొని కోర్విచల్మా గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి బాకీ ఉన్న డబ్బుల నుండి కొంత డబ్బు అప్పగించి వస్తుండగా ముత్తే బుచ్చయ్య పల్లె వద్ద హార్వెస్టర్ వాహన డ్రైవర్ తన వాహనాన్ని సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల ఉన్న వీరు ఇరువురు బైక్ను ఆపగా హార్వెస్టర్ డ్రైవర్ తన వాహనాన్ని నిర్లక్ష్యంగా రివర్స్ తీసుకురాగా ఈ ప్రమాదం జరిగింది. మృతుని కొడుకు దుర్గం సాయికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Admin
E Nivas News