ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహబూబ్ ఖాన్ సియాసత్ అనే ఉర్దూ పత్రిక నందు రిపోర్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 2024 సంవత్సరం మార్చి నెలలో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ఆధారంగా సైబర్ క్రైమ్ నిందితులు తన అకౌంట్ నుండి విడతలవారీగా గత నవంబర్ 2025 వరకు తన అకౌంట్లో ఉన్న 2.45 లక్షలను తష్కరించారు. తన సొంత అవసరాల నిమిత్తం బ్యాంకుకు వెళ్లగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది, తనకు తెలియకుండానే తన అకౌంట్ నుండి డబ్బులు పోవడంతో బ్యాంకు అధికారులు తెలిపిన నిజాల ప్రకారం సైబర్ క్రైమ్ జరిగిందని వెంటనే 1930కి ఫిర్యాదు చేయడంతో చివరగా మోసపోయిన డబ్బుల నుండి 20వేల రూపాయలు నిందితుడి అకౌంట్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ డబ్బులను జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జడ్జి సహాయంతో 20వేల రూపాయలను తిరిగి చెక్కు ద్వారా వచ్చే విధంగా ఇతరులను జారీ చేశారు. వచ్చిన చెక్కును జిల్లా ఎస్పీ బాధితునికి అందజేయడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశాడు. సైబర్ క్రైమ్ బాధితులు 1930 కి గోల్డెన్ సమయంలో ఫిర్యాదు చేసిన యెడల మోసపోయిన డబ్బు ఎక్కువ శాతం తిరిగి వచ్చే విధంగా చేయవచ్చని తెలిపారు. ఆర్థిక నేరాలలో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్, నకిలీ వెబ్ అప్లికేషన్లు, ఏఐ ఆధారిత మోసాలు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి వాటి వల్ల అప్రమత్తతో ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ గోపికృష్ణ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.
Admin
E Nivas News