Friday, 11 September 2026 08:13:20 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

వైయస్సార్ ప్రజల గుండెల్లో ఎప్పుడు గుర్తుండే ఉంటారు.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Date : 02 September 2026 08:13 PM Views : 61

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కీ.శే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో గుర్తుండే ఉంటారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. బుధవారం వైయస్సార్ వర్ధంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వై ఎస్ ఆర్ చేపట్టిన ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంట్, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు ప్రజల్లలో చిరస్తాయిలో ప్రజలు గుండెల్లో ఉన్నాయని, వైయస్సార్ పాదయాత్ర లో పల్లెలను పరిశీలించి రైతులతో మాట్లాడి అధికారం లోకి వచ్చాక రైతు పక్షపాతి పథకాలు ప్రవేశ పెట్టారు. సాగు నీటి అంశాల విషయంలో వైఎస్ ఆశయాలకు అనుగుణంగా స్థానిక జగిత్యాల నాయకులు పనిచేయలేక పోయారన్నారు. జగిత్యాలలో ఇందిరమ్మ కాలనీని మంజూరు చేసింది వైయస్సార్ గారే అని కొనియాడారు, దీనికి మౌలిక సదుపాయాలు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత రెడ్డి గారి ద్వారా పూర్తి చేస్తున్నాను అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల లో అర్బన్ హౌసింగ్ కాలనీ లో వైఎస్ గారు 2008లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే అక్కడ కరెంట్ కనెక్షన్ తీసుకున్నది , 2009 వరకు ఒకరు మాత్రమే 2014వరకు పదుల సంఖ్య లో మాత్రమే 2020వరకు 170మంది 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌలిక సదుపాయాలు కు 36కోట్లు మంజూరు తో ప్రజల్లో ఆశ చిగురించి 2026 లో 3500మంది విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు అని ఇందిరమ్మ కాలనీ వాసులకు రేవంత్ సర్కార్ పూర్తి భరోసా కల్పిస్తుంది అని ఎమ్మెల్యే అన్నారు., త్వరలో దాదాపు అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం పిసిసి సెక్రెటరీ బండ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, పిసిసి సేవాదళ్ సెక్రెటరీ ముఖేష్ కన్నా,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త. మోహన్, భార్గవ్, సేవాదళ్ పట్టణ అధ్యక్షులు ద్యావన్ పల్లి. రాజేందర్, డీసీసీ ఉపాధ్యక్షులు జెల్ల. రవి, రేపల్లె. హరి కృష్ణ,డీసీసీ కార్యదర్శి పులి. నర్సయ్య, కూసరి. అనిల్, లైశెట్టి. చంద్ర మౌళి, కోలా శ్రీనివాస్,బాల ముకుందం, రెడ్డి సంఘము జిల్లా అధ్యక్షులు కోప్పెర. వెంకట్ రెడ్డి, సురేష్, సతీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :