Friday, 11 September 2026 07:39:58 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

శాసనసభ కాదు.. దుశ్శాసనసభ నడుపుతున్నాడు...

రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం...

Date : 08 September 2026 10:27 AM Views : 38

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, నిరసనలు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభను కాంగ్రెస్ ప్రభుత్వం 'దుశ్శాసన సభ'గా మార్చివేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన పోలీస్ బృందం కిరాతకంగా వ్యవహరించాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎంత రెచ్చగొట్టినా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించాలని తమ అధినేత కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు. నాడు పార్లమెంట్‌లోరాహుల్ గాంధీ టీ-షర్టులు ధరించి నిరసన తెలిపిన తరహాలోనే తాము కూడా అసెంబ్లీకి వెళ్లామని స్పష్టం చేశారు. అజాత శత్రువులుగా పేరున్న మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు ప్రవర్తించిన తీరును సమాజం నిశితంగా గమనించిందని అన్నారు. అసలు ఏ రూల్ ప్రకారం తమను అడ్డుకున్నారో చెప్పడానికి అధికారుల వద్ద సమాధానం లేదన్నారు.టీ-షర్టులపై ఎలాంటి అభ్యంతరకర పదాలు లేవని, అలా ఉన్నాయని అనడానికి డీసీపీ శిల్పవల్లి ఎవరని నిలదీశారు. రేవంత్ రెడ్డిని నిలదీస్తామనే భయంతోనే తమను అడ్డుకున్నారని, ఆ తర్వాత ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కొత్త నాటకాలకుతెరలేపారని ఆరోపించారు. సభలో జరిగిన గలాటాకు ఆద్యుడు ముఖ్యమంత్రేనని కేటీఆర్ విమర్శించారు. 'వలువలు విప్పుతా' అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం, అసెంబ్లీలో బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీ.కే. అరుణకు తాను, జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు సభలో జరిగిన ఘటనకు రేవంత్ రెడ్డి స్పందించి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని, సభలో నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సర్వభ్రష్ట ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: